ఐదు వందే భారత్ రైళ్ల ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం క్రమేపి పెంచుకుంటు వస్తొంది..మంగళవారం మరో ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్, భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి రెండు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు..మడ్ గావ్ నుంచి ముంబై,, ధార్వాడ నుంచి బెంగళూరు,,హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు..ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది.