తూర్పు కాపుల అభ్యున్నత కోసం జనసేన పాటుపడుతుంది-పవన్ కల్యాణ్
అమరావతి: ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువని, దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారని అయితే తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు..మంగళవారం వారాహి యాత్రలో బాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ నేతలతో భీమవరం సమీపంలోని పెదమీరం నిర్మాల ఫంక్షన్ హల్ లో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణాంకాలు వెలికి తీస్తామన్నారు..సమాజంలో అందరినీ సమానంగా చూస్తే ఈ కులాల గొడవ ఉండదని,, అప్పుడు ఈ కుల రాజకీయాలు ఉండవని అటువంటి సమాజం రావాలని ఆకాంక్షించారు..
తూర్పు కాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారన్నారు..వారిలో మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి వారు కులాన్ని పట్టించుకోకుండా కులం పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదుగుతున్నారంటూ ఆరోపించారు..తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు విషయంలో తారతమ్యాలు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.. తెలంగాణలో కొంతమందిని బీసీ కులాలను వారి జాబితా నుండి తొలగించారని,,అప్పుడు ఏ ప్రజా ప్రతినిధి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు.. ప్రతీ మనిషిలోను ప్రశ్నించే తత్వం ఉండాలన్నార…రాష్ట్ర విభజన వలన బీసీ కులానికి చెందిన కాపులు తీవ్రంగా నష్టపోయారని,, తూర్పు కాపుల అభ్యున్నత కోసం జనసేన పాటుపడుతుందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తూర్పుకాపులకు భరోసా ఇచ్చారు..