నూతన కార్యవర్గాన్ని అభినందించిన కమిషనర్
నెల్లూరు: నగర పాలక సంస్థ “మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్” నూతన కార్యవర్గాన్ని కమిషనర్ వికాస్ మర్మత్ అభినందించారు. సోమవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు కమిషనర్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కమిషనర్ ను కలిసిన వారిలో మున్సిపల్ ఉద్యోగుల అధ్యక్షులు చక్రపాణి, నూతన అసోసియేషన్ అధ్యక్షులు పి.శీనయ్య, కార్యదర్శి ఇనాయతుల్లా, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, కన్వీనర్లు కృష్ణ కిషోర్, సునీల్ కుమార్, ట్రెజరర్ వంశీనాథ్ రెడ్డి, మహిళా ఆర్గనైజర్ విజయ తదితర కార్యవర్గ సభ్యులు మరియు ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.