AMARAVATHITECHNOLOGY

జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వసిద్దం చేస్తున్నాం- ఇస్రో చైర్మన్ సోమనాధ్

అమరావతి: భారత్ చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక మిషన్ చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ బుధవారం తెలిపారు..జూలై 12-19 మధ్య శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగిస్తామని,,అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామన్నారు.. ‘ప్రస్తుతం చంద్రయాన్-3ను స్పేస్ క్రాఫ్ట్ కు పూర్తిగా అనుసంధించడం జరిగిందన్నారు..అన్ని పరిస్థితులు అనుకూలిస్తే జూలై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 నింగిలోకి వెళ్తుందని సంబందిత వర్గాలు వెల్లడించాయి.. చంద్రయాన్-3 మిషన్ను అత్యంత బరువైన రాకెట్,,జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్-III ద్వారా ప్రయోగించనున్నారు..స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (LM),, ప్రొపల్షన్ మాడ్యూల్ (PM)తోపాటు చంద్రుడిపైకి దించే రోవర్ను పంపుతారు..రూ.615 కోట్ల వ్యయంతో చేపడుతున్న చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడిపై రోవర్ ను సురక్షితంగా ల్యాండ్ చేయనున్నారు.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు పరిశోధనలు చేపట్టనున్నారు..చంద్రుడి మీద ప్రయోగాలు నిర్వహిస్తే, ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలువనున్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *