AMARAVATHIDEVOTIONAL

రామ్ లల్లా గర్భాలయం పనులు దాదాపు పూర్తి-ట్రస్టు ప్రధాన కార్యదర్శి

అమరావతి: అయోధ్యలో భవ్య రామామందిరం నిర్మాణం పనులు ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయి.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షణలో రామ్ లల్లా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే సంవత్సరం జనవరి 22న జరుగనున్నది.. రామ్ లల్లా గర్భాలయం పనులు దాదాపు పూర్తి కావచ్చయని, లైటింగ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయని, టెంపుల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోషల్ మీడియాలో శనివారంనాడు పోస్టు చేశారు.. ట్రస్టు పర్యవేక్షణలో నిలకడగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు..బాల రాముడి విగ్రహ నిర్మాణం మూడు స్థానాల్లో జరుగుతోందని,, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని రాయ్ తెలిపారు..గ్రౌండ్ ఫ్లోర్ లోని గర్భగృహంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు..ప్రాణప్రతిష్ట కార్యక్రమం దివ్యవంగా జరుగుతుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *