రేణిగుంట – శ్రీకాళహస్తి రహదారి- విజయవాడ వాసులు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి 3 km దూరంలో ఆదివారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి..రేణిగుంట – శ్రీకాళహస్తి రహదారిలోని మిట్ట కండ్రిగ వద్ద ముందు వెళ్లుతున్న వాహనంను AP39G-3233 మారుతి వెర్టిగో కారు,,ముందు వెళ్లుతున్న మరో వాహానంను ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొన్నట్లు తెలుస్తొంది..డ్రైవర్ వేగంను అదుపు చేయలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం..కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా మరో మొత్తం ఆరుగురు అక్కడిక్కడే మరణించారు..ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన భరత్((22) అనే యువకుడిని శ్రీకళాహస్తీ MGM ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని C.I విక్రమ్ మీడియాకు తెలిపారు..మృతులు అందరూ విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు..మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ అని పోలీసులు తెలిపారు.