రాష్ట్రంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు-చెదురుమదురు వర్షాలు-ఐఎండీ
అమరావతి: రోహిణి కారై వెళ్లి మృగశిర కారై వచ్చిన సూర్యుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గలేదు..నేటికి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 46,,47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి..నేపథ్యంలో ఎండల దెబ్బలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది..ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ కర్ణాటక తమిళనాడు తీరాన్ని తాకగా నేడు ఏపీలో ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది..తిరుపతి జిల్లా శ్రీహరికోటతో సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలియజేసింది..కర్ణాటక,,తమిళనాడు,, మహారాష్ట్ర,,ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది..రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.