x
Close
DEVOTIONAL DISTRICTS

నగరంలో ప్రారంభంమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు

నగరంలో ప్రారంభంమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు
  • PublishedAugust 16, 2022

20వ తేది వరకు..

నెల్లూరు: నగరంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో జిల్లా వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కోరారు..తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా తొలి రోజు మంగళవారం ఉదయం జరుగుతున్న వసంతోత్సవాల పూజా కార్యక్రమంలో మంత్రి, రాజ్యసభ సభ్యులు,విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,తదితరులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సంధర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే ఇక్కడా శ్రీవారి సేవలు నిర్వహిస్తారని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో పాల్గొని  భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మరలా నెల్లూరులో నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లను చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులకు హృదయ పూర్వక ధన్యవాదాలను తెలియచేస్తున్నాను అని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, భక్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.