AMARAVATHITECHNOLOGY

విజయవంతమైన ఆదిత్య L-1 ప్రయోగం

అమరావతి: ఆదిత్య L-1 వర్స్ స్టేషన్ ను PSLV C-57 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి 63 నిమిషాలు వ్యవధిలో ప్రవేశపెట్టింది..రాకెట్ నుంచి ఆదిత్య L-1 విజయవంతంగా విడిపోయిందని ఇస్రో వెల్లడించింది..దీంతో అమెరికా, జపాన్, యూరప్, చైనా తర్వాత సూర్యుడిపై రాకెట్ పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది..సూర్యుడి రహస్యాలను శోధించేందుకు శనివారం ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఆదిత్య L-1ను ప్రయోగించారు..ఆదిత్య L-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దాదాపు 125 రోజులు పడుతుంది..తొలుత వర్స్ స్టేషన్ ను జియో ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు..అనంతరం అంతరిక్షంలో లాగ్రాంజ్ పాయింట్ అనేది పార్కింగ్ ఏరియా వంటిది..ఆదిత్య-L1 ఇక్కడకు చేరుకున్న తరువాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు తెలియచేస్తుంది..ఇలా సూర్యుడి చుట్టూ 5 లాగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *