x
Close
NATIONAL

విజయవంతమైన పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం-DRDO

విజయవంతమైన పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం-DRDO
  • PublishedJanuary 11, 2023

అమరావతి: భారత్ క్షిపణుల భాండగారంలో మరో అస్త్రం వచ్చి చేరుకుంది..‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ (Prithvi-II Missile)ప్రయోగంలో విజయం సాధించింది..దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం రాత్రి ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ పేర్కొంది..పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని,,350 కి.మీ. రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది..స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలోడ్ తో,350 కిలోమీటర్ల రేంజ్ లోని టార్గెట్ ను ఛేధించగలదని తెలిపింది..ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ కావటంతో భారత ఆర్మీలో అమ్ముల పొదలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.