విజయవంతమైన పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం-DRDO

అమరావతి: భారత్ క్షిపణుల భాండగారంలో మరో అస్త్రం వచ్చి చేరుకుంది..‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ (Prithvi-II Missile)ప్రయోగంలో విజయం సాధించింది..దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం రాత్రి ఒడిశాలోని చండీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ పేర్కొంది..పృథ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి అని,,350 కి.మీ. రేంజ్లోని లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించింది..స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్పై నడిచే ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలోడ్ తో,350 కిలోమీటర్ల రేంజ్ లోని టార్గెట్ ను ఛేధించగలదని తెలిపింది..ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ కావటంతో భారత ఆర్మీలో అమ్ముల పొదలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది..