AMARAVATHIHEALTH

ప్రతి రోజు ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకొండి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని  సమర్థంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న వైనం పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకంను అమలు చేస్తున్నందున, సంబంధిత అధికారులందరూ మనసు పెట్టి పనిచేయాలన్నారు. అర్హత గల రోగులను ఆరోగ్యశ్రీ లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రతి రోజు ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు ఖచ్చితమైన పురోగతి ఉండేలా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వ్యక్తిగత శ్రద్దతో పనిచేయాలన్నారు. నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెంచేవిధంగా నిర్ధిష్ట కార్యాచరణతో ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ రమేష్, జి జి హెచ్ సూపరింటెoడెంట్ డా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *