అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తెలంగాణ బీజెపీ
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితలో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది..ఈ జాబితకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది..బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎంపికలో SC,ST,BC General వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు..
అభ్యర్థుల తొలి జాబితాలో:- ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు.హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతారు..సిర్పూర్-పల్లవి హరీష్ బాబు,,బెల్లంపల్లి-శ్రీదేవి,,ఖానాపూర్-రమేష్ రాథోడ్,,ఆదిలాబాద్-పాయల్ శంకర్,,బోథ్-సోయం బాపురావు,,నిర్మల్-ఆలేటి మహేశ్వర్రెడ్డి,,ముథోల్-రామారావు పటేల్,,ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి,,జుక్కల్-అరుణతార,,కామారెడ్డి-వెంకటరమణారెడ్డి,, నిజామాబాద్ అర్బన్-ధనపాల్ సూర్యనారాయణగుప్తా,, బాల్కొండ-అన్నపూర్ణమ్మ,,కోరట్ల-ధర్మపురి అర్వింద్,,జగిత్యాల-బోగ శ్రావణి,,ధర్మపురి-ఎస్.కుమార్,,రామగుండం-కందుల సంధ్యారాణి,,కరీంనగర్-బండి సంజయ్,,చొప్పదండి-బొడిగె శోభ,, సిరిసిల్ల-రాణిరుద్రమ,,మానకొండూర్-ఆరేపల్లి.మోహన్,,నర్సాపూర్-మురళీయాదవ్,,పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్,, దుబ్బాక-రఘునందన్ రావు,, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలంగౌడ్,,ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్ గౌడ్,, గోషామహల్ – రాజా సింగ్,, మహేశ్వరం-అందెల శ్రీరాములుయాదవ్ తదితరులు వున్నారు.