ఆర్మీ వాహనలపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు-ముగ్గురు జవాన్లు మృతి
అమరావతి: జమ్ముకశ్మీర్ లో గురువారం పూంచ్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు తెగబడ్డారు..జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే ఆప్రమత్తమైన సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు..రాజౌరీ-థనామండ-సున్ కోటే మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభం అయిందని,, ఇంకా కొనసాగుతూనే ఉన్నదని అధికారులు వెల్లడించారు..ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారని తెలిపారు..బుప్లియాజ్ ప్రాంతంలో ఉగ్రావాదులు వున్నట్లు సమాచారం మేరకు భధ్రత దళవాలు బుధవారం రాత్రి నుంచి పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిందని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు..ఈ కాల్పుల సంఘటన గురించి సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.