AMARAVATHINATIONAL

అవినీతికి చోటు లేకుండా అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసింది-ప్రధాని మోదీ

ఉగ్రవాదం,నక్సలిజం పూర్తిగా..

అమరావతి: కాంగ్రెస్ (UPA) హ‌యాంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్య‌మేలిందని,, త‌మ(NDA) 10 సంవత్సరాల పాల‌న‌లో దేశంలో ఎలాంటి స్కామ్‌లకు చోటు లేకుండా చర్యలు చేపట్టడడం జ‌రిగిందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పష్టం చేశారు..ఇంద్రప్రస్థాలో ఆదివారం భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మహాసభలు(2024) రెండో రోజు సదస్సులో కార్యకర్తలు,నాయకులను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ విప‌క్ష నేత‌లు ఈసారి NDAకు 400 స్ధానాలంటూవ్యాఖ్యనించారని గుర్తు చేశారు.. NDAకు 400 స్ధానాలు వ‌చ్చే దిశ‌గా బీజేపీ సోంతగా 370 స్ధానాలు పైగా గెలుచుకునే దిశగా కార్యకర్తలు,నాయకులు పనిచేయాలని ప్ర‌ధాని కోరారు..బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారని అయితే ఇప్పుడు అసలు సమయం వచ్చిందని, 100 రోజులు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో,కొత్త విశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు..తాము మెగా స్కామ్‌లు,, ఉగ్ర దాడుల నుంచి దేశాన్ని ర‌క్షించామ‌న్న విషయం దేశం మొత్తం గుర్తిస్తొందన్నారు.. తాము పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రిచేందుకు చర్యలు చేపట్టామని,,ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నయన్నారు..అభివృద్ధి చెందిన దేశంగా భార‌త్ ముందకు సాగాలంటే రాబోయే 5 సంవత్సరాలు కీల‌క‌మ‌న్నారు..2047 నాటికి భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మ‌లిచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను గ‌త 10 సంవత్సరాల్లో చేప‌ట్టామ‌ని ప్ర‌ధాని మోదీ వివ‌రించారు.. మ‌న దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

అమిత్ షా:- 10 సంవత్సరాల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో కుటుంబపాలనకు చరమగీతం పాడారన్నారని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అన్నారు..ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో ఉగ్రవాదం,,నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని,,మరో 5 సంవత్సరాలు తమ ప్రభుత్వం బాధ్యతలు నిర్వహిస్తే, ఉగ్రవాదం,,నక్సలిజం పూర్తిగా అంతం అవుతాయన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *