శ్వేత వర్ణంతో అందాలను సంతరించుకున్న జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్
అమరావతి: ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తొంది..హిమపాతం కారణంగా కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి..దాదాపు అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ ఆనందిస్తున్నారు.. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు హిమపాతం రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.ఇదే సమయంలో ఈ ప్రాంతంకు వస్తున్న పర్యాటకులు,,ప్రజలు,, వాహనదారులు రహదారులు మంచుతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు యుద్ద ప్రతిపాదికన రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు..అలాగే జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, పూంచ్ లోని సావ్జియాన్ సెక్టార్ లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.
#WATCH | Jammu & Kashmir's Kupwara receives heavy snowfall pic.twitter.com/16Na1zSvxc
— ANI (@ANI) February 19, 2024