AMARAVATHINATIONAL

శ్వేత వర్ణంతో అందాలను సంతరించుకున్న జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌

అమరావతి: ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తొంది..హిమపాతం కారణంగా కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి..దాదాపు అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ ఆనందిస్తున్నారు.. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు హిమపాతం రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.ఇదే సమయంలో ఈ ప్రాంతంకు వస్తున్న పర్యాటకులు,,ప్రజలు,, వాహనదారులు రహదారులు మంచుతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు యుద్ద ప్రతిపాదికన రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు..అలాగే జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్‌ లోని సావ్జియాన్‌ సెక్టార్‌ లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *