AMARAVATHIPOLITICS

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్‌ షో బెంజి సర్కిల్ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు..ప్రధాని మోదీకి 14 మంది కూటమి పార్టీల ప్రతినిధులు స్వాగతం పలికారు..రోడ్డు మార్గంలో ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు బయలుదేరారు.. అనంతరం స్టేడియం వద్ద మోదీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలికారు..సాయంత్ర 7 నుంచి 8 వరకు ప్రధాని నేతృత్వంలో బందరు రోడ్డులో రోడ్‌ షో జరిగింది.. మెుత్తం 1.8 కి.మీ. రోడ్‌ షోలో ప్రధానిమోదీ పాల్గొన్నారు.. ప్రధానితో పాటుగా ఓపెన్ టాప వాహానంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రోడ్డు షోలో పాల్గొన్నారు.. రోడ్ షోలో కూటమి లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు సైతం వెనుక మరోక వాహానంలో పాల్గొన్నారు..కూటమి రోడ్డు షో చూడటానికి మూడు పార్టీల అభిమానులు బందరు రోడ్డుకు భారీగా తరలివచ్చారు..రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ ముందుకు సాగారు.రోడ్డు షో అనంతరం ప్రధాని మోదీ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢీల్లీకి వెళ్లారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *