ఆస్కార్ అకాడమీ జ్యూరీ మెంబర్స్ గా స్థానం దక్కించుకున్న RRR బృందం
అమరావతి: RRR చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం విదితమే..మరోసారి భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అందించింది..ఆస్కార్ గెలుచుకున్న ఈ సినిమా యూనిట్ కు నేడు అకాడమీ జ్యూరీ మెంబర్స్ గా స్థానం దక్కింది.. ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ కొత్తగా ఆస్కార్ కమిటీలో వివిద దేశాలకు చెందిన 398 మందికి సభ్యత్వం కల్పిస్తూ జాబితాను తాజాగా విడుదల చేసింది..ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు చెందిన ఆరుగురు ఉండటం విశేషం.. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది..అలాగే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు కూడా స్థానం లభించింది.. ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీర్,, చరణ్ లకు స్థానం లభించడంతో మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా నటులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అయితే ఈ జాబితలో దర్శకుడు రాజమౌళి పేరు లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు..ఎంతో కృషి చేసిన జక్కన్నకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.