AMARAVATHICRIME

రూ.2.50 లక్షల విలువ చేసే టమోటాల దొంగతనం

అమరావతి: బంగారం,నగదు,ఖరీదైన వస్తువులను చోరీ చేసే దొంగలు ప్రస్తుతం,మార్కెట్ లో గిరాకీ వున్న పండ్లు,,కూరగాయలను దొంగలించి రైతు కడుపు కొడుతున్నారు..కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామంలో ధరణి అనే మహిళా రైతు వ్యవసాయం చేస్తున్నారు..అమె తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను సాగు చేసింది.. కాపు కూడా బాగా కాసింది..ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ.120 పైనే వుంది..దీంతో తమ కష్టలు కొంత మేర అయిన తీరిపోతాయి అనుకున్నది..మరో రెండు రోజుల్లో టమాటాలను బెంగళూరుకు తరలించేందుకు ఆమె సిద్దమైంది..కానీ మంగళవారం రాత్రే టమాటా తోటలో దొంగలు పడి, దాదాపు 50 నుంచి 60 బస్తాల టమాటాను దొంగిలించారు..ఈ టమాటాల విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.. మిగతా పంటను నాశనం చేశారని ఆమె తెలిపింది..బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *