నేటి యువత పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది-చక్రధర్ బాబు
నెల్లూరు: ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ప్రతిభ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో చక్రధర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, నాలుగున్నర సంవత్సరాలుగా వైద్య విద్యను అభ్యసించి నేడు ప్రాక్టికల్ గా వైద్య విద్యను నేర్చుకునేందుకు హౌస్ సర్జన్ షిప్ లోకి అడుగిడుతున్న వైద్య విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, హౌస్ సర్జన్ విద్యార్ధులకు కొన్ని పరిమితులు వుంటాయని,వాటికి లోబడి సీనియర్ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. ప్పటి నుండే ప్రతి వైద్య విద్యార్ధి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని వైద్య విద్య పూర్తి అయిన తరువాత వైద్యులుగా పేదలకు వైద్యం అందించడంలో కృషి చేస్తూ వైద్య కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్ సంధర్భంగా జిజిహెచ్ లో కోవిడ్ పేషెంట్స్ కు మెరుగైన వైద్యం అందించి జిల్లా కు మంచి పేరు తీసుకురావడంలో వైద్యలు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో GGH సూపరింటెండెంట్ డా.శిద్దా నాయక్,APMSIDC EE విజయభాస్కర్, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కో ఆర్డినేటర్ శ్రీమతి సునంద, వివిధ విభాగాల H.O.Dలు, హౌస్ సర్జన్ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.