అమరావతి రాజధానిపై విచారణ డిశంబరుకు వాయిదా-సుప్రీం
అమరావతి: అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు..ఆగష్టు నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది..రాజధానిపై దాఖలైన పటిషన్లపై విచారణ డిసెంబర్ లో చేపడతమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా, త్రివేది కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది..ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది..ప్రతివాదుల్లో చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని,, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించినట్లయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్లేనని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు..అయితే, కొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతులు కోర్టుకు తెలిపారు.. దీంతో ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్ ను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.