చంద్రుడి దక్షిణ ధ్రువం ఫోటోలను పంపించిన విక్రమ్ ల్యాడర్
అమరావతి: జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగిడేందుకు ఈ నెల 23వ తేదిన సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ సిద్దమౌతొంది..ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషన కొనసాగిస్తొంది..భూమి నుంచి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్ తన కెమెరాలో క్లిక్ మన్పించింది..ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సోషల్ మీడియాతో పంచుకుంది..విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు వెల్లడించింది..చంద్రునిపై విక్రమ్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది..బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది..చారిత్రక ఘట్టం కోసం భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.