AMARAVATHICRIME

లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు- 2 మృతి,పలువురికి గాయాలు

అమరావతి: ఉత్తరాంధ్రజిల్లా అయిన అల్లూరిజిల్లా పాడేరు ఘాట్ లో రోడ్డు ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయపడ్డినట్లు తెలుస్తొంది.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ వ్యూపాయింట్ వద్దకు చేరుకునే సమయలో చెట్టు కొమ్మను తప్పించబోవడంతో బస్సు అదుపు తప్పి లోయలోపడిననట్లు ప్రాథమిక సమాచారం.. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..బస్సు పడిపోయిన ప్రాంతంలో లోయ లోతు 100 అడుగుల వరకు వుంటుంది..ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *