AMARAVATHIHYDERABAD

విచారణకు రేపు రావలన్న సిబిఐ,ముందస్తు బెయిల్ పిటీషన్ పై రేపే విచారిస్తాం-కోర్టు

హైదరాబాద్: సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఇంటి వద్ద మీడియా తెగ హడవిడి చేసింది..వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి,, సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కోసం ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు బయలుదేరారు.. సీబీఐ విచారణ సమయంలో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ వ్యాఖ్యం దాఖాలు చేశారు అవినాస్ రెడ్డి…అప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుండటంతో (18వ తేది) మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు వాట్స్ ప్ ధ్వారా సమాచారం ఇచ్చారు..దీంతో తన కాన్వాయ్ ను వెనక్కి తిప్పి ఇంటికి వెళ్లిపోయారు..తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ చార్జీషీట్ లో అవినాష్ రెడ్డి సహనిందితుడని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది.. ఏప్రిల్ 30వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని,,అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ లాయర్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *