హమాస్ పై విజయం సాధించేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తాం-బెంజిమెన్
అమరావతి: హమాస్ పై విజయం సాధించేదాకా తాము ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పఫ్టం చేశారు..తాము సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని,ఇలాంటి సమయంలో తమ వీరులను కొల్పొవాల్సి వస్తుందన్నారు..ప్రతీ సైనికుడు తమకు ‘ప్రపంచం’తో సమానమని అన్నారు..గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభించిన ఇజ్రాయిల్, 11 మంది సైనికులు కొల్పొయిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెల్లడించిన తరువాత నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు..హమాస్ ని సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా తెలుస్తొంది.. అమాయకులైన తమ పౌరులను హమాస్ దారుణంగా చంపిందని,,వారిని పూర్తిగా అంతమొందించేదాకా తాము విశ్రాంతి తీసుకోబోమని, తమతో పెట్టుకొని హమాస్ క్షమించరాని తప్పు చేసిందని యుద్దం ప్రారంభంలో బెంజిమెన్ వ్యాఖ్యానించారు.