సరిహద్దుల వద్ద 1962లో చైనాతో ఏం జరిగిందొ.కాంగ్రెస్ నిజాయితీగా ప్రజలకు చెప్పాలి-జైశంకర్
అమరావతి: భారతదేశ సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే, ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు.మంగళవారం జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్దకు సైన్యాన్ని పంపింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని,, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు..సరిహద్దుల వద్ద చైనా సైన్యాన్ని మోహరిస్తుండడంతో,మన సైనికులను పంపించారన్నారు. సరిహద్దుల వద్ద 1962లో చైనాతో ఏం జరిగింది అనే విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిజాయితీగా ప్రజలకు నిజాలు చెప్పాల్సి అవసరం ఉందన్నారు.మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం బడ్జెట్ ను 5 రెట్లు పెంచిందని తెలిపారు. ప్యాంగోంగ్ సరస్సు వద్ద గత సంవత్సరం చైనా బిడ్జి నిర్మాణలు మొదలు పెడుతున్న సమయంలో దానిపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై కూడా జైశంకర్ స్పందిస్తూ,, 1962 యుద్ధం నుంచి చైనా అక్రమ అధీనంలోనే ఆ ప్రాంతం ఉందని గుర్తు చేశారు. మొదటి సారి చైనా సైన్యం 1958లో అక్కడకు వచ్చిందని, 1962లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని,అప్పటి ప్రదాని నెహ్రు వున్నారని తెలిపారు..ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో చైనా బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ,,మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోందని మండిపడ్డారు.