LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ బ్రతికే వున్నాడు-నెడుమారన్
అమరావతి: LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు.. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు..నెడుమారన్కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది..తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్బంలో అయన పై వ్యాఖ్యలు చేశారు..ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు..ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు..త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు…ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా…ప్రభాకరన్ గురించి తమిళులకు ఈ శుభవార్త చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నా… ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు…కానీ, త్వరలోనే తమిళ ఈలం కోసం ఆయన తన కార్యాచరణ ప్రకటిస్తారు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ప్రభాకరన్కు మద్దతివ్వాలి…తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అండగా నిలవాలి…రాజపక్సె పాలనలో శ్రీలంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈలాంటి సమయంలో ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు ఇదే మంచి తరుణం అన్నారు…2009లో శ్రీలంక సైన్యానికి, LTTEకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించారు..అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పటి శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది.