నగర పాలక సంస్థ బడ్జెట్ రూ.716, 49,03,000లు అమోదం-మేయర్ స్రవంతి
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వ సభ్య బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.. 2022-23 ఆర్ధిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు రూ.507,56,85,545/- లు,,అలాగే 2023-24 వార్షిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.716, 49,03,000/- లకు కౌన్సిల్ ఆమోదించడం జరిగినది. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. అనంతరం ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ స్థానిక సమస్యలను, అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని మేయర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.