AMARAVATHIINTERNATIONAL

తైవాన్‌ రాజధాని తైపీలో తీవ్ర భూకంపం-ఏడు వందల మంది మృతి,800 మందికి గాయాలు

అమరావతి: తైవాన్‌ రాజధాని తైపీని భూప్రకంపనలు కుదిపి వేశాయి..బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రిక్టార్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూమి కంపించింది.. 25 సంవత్సరాల్లో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే..భూకంపం తాకిడితో అక్కడ భారీగా ఆస్తి,, ప్రాణ నష్టం సంభవించింది..ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఈ భూకంపం ధాటికి 800 మంది గాయపడగా,,7 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది..భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్ననేపథ్యంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు..1999 తరువాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు.. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది..భూప్రకంపనల ధాటికి దాదాపు 2,500 మందికి పైగా మరణించగా,,1,300 మందికి పైగా గాయపడ్డారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *