AMARAVATHINATIONAL

మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీని వరించిన భారతరత్న

అమరావతి: మాజీ ఉప ప్రధాని,, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న వరించింది.. శనివారం ఉదయం ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు..అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని ప్రదాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.. నేటి రోజుల్లో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరని,, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు..అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారని వెల్లడించారు.. హోంమంత్రిగా, ఐఅండ్ బీ మంత్రిగా కూడా సేవలు అందించారని తెలిపారు..ఎల్ కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందని ప్రశంసించారు..ఈ సందర్బంలో అత్యున్నత పురస్కారం వరించిన సందర్బంగా అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్లు ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *