నేటి నుంచి అమల్లోకి వచ్చిన CAA
అమరావతి: లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ పౌరసత్వ సవరణ చట్టం నియమ నిబంధనలను (CAA)ని సోమవారం నోటిఫై చేసింది..దింతో CAA అమల్లోకి తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్లోనే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకొన్నది.. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు కేంద్రమంత్రులు సైతం ఎన్నికలకు ముందే సీసీఏను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు.