నవంబరు 15 నుంచి రాష్ట్రంలో కుల గణన ప్రారంభం
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఈ నెల 15వ తేది నుంచి కుల గణన ప్రారంభించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు..అలాగే ఉద్యోగులకు డీఏ అమలుకు ఆమోదం తెలిపింది..దేవాలయాల ఆదాయ పరిమితుల ఆధారంగా కేటగిరీల్లో మార్పులకు ప్రభుత్వం ఆమోదించింది.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్-1 పోస్ట్ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.