AMARAVATHIINTERNATIONAL

దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటించిన కొలరాడో కోర్టు

అమరావతి: అమెరికా మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే సంవత్సరం జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది..కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం 2021, జనవరి 6వ తేదీన జో బైడెన్ విక్టరీని అడ్డుకుంటూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది..అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు.. కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది..మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు..కానీ 2024లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొలరాడో తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. వచ్చే సంవత్సరం మార్చి 3వ తేదీ జరగనున్న కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్ కమే తాజా తీర్పు వర్తిస్తుంది..ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ ఓటర్లు అధ్మక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు.. కొలరాడో తీర్పు వల్ల నవంబర్ లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం ఉండే అవకాశం వున్నాయి..ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ట్రంప్ టీమ్ లీగల్ టీమ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *