భావి తరాల పౌరులు,బాల కార్మికులుగా మారిపోతారు-శ్రీనివాసులు
నెల్లూరు: నగరంలోని 51,52వ డివిజన్స్ పరిధిలోని సెయింట్ జోసెఫ్,సెయింట్ పీటర్స్ స్కూల్స్ ను 2023-24 విద్యా సంవత్సరం నుంచి మూసివేసేందుకు ప్రభుత్వం ఉపక్రమించడం దారుణమని మాజీ కార్పొరేటర్స్ ప్రశాంత్, కప్పిర.శ్రీనివాసులు,సత్యనాగేశ్వరావులు అవేదన వ్యక్తం చేశారు.సోమవారం సదరు స్కూల్ విద్యార్ధిని,విద్యార్దులతో కలసి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.