జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పటిలోపు పునరుద్ధరిస్తామో చెప్పలేము-కేంద్రం
అమరావతి: జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పటిలోపు పునరుద్ధరిస్తామో చెప్పలేమని,,ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం,,రాష్ట్ర ఎన్నికల సంఘలపైన వుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది..కేంద్ర పాలిత ప్రాంతం అన్న హోదా మాత్రం తాత్కాలికమేనని,,జమ్మూకాశ్మీర్ ను పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు..జమ్ముకశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంటూ,,తొలుత పంచాయితీ,,తరువాత మునిసిపాల్,,అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహస్తామని కోర్టుకు తెలిపారు..లద్దాఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్,,లేహ్ లో ఎన్నికలు ముగిశాయని,,వచ్చే నెలలో కార్గిల్ లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు..ఆర్టికల్ 370 తొలగించాక జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని,,ఉగ్రవాద కార్యకలాపాలు 2018తో పోల్చితే 2023 నాటికి 45.2 శాతం తగ్గాయని అలాగే చొరబాటు యత్నాలు 90 శాతం తగ్గాయని తెలియచేశారు.