రెండు అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించిన జనసేన
అమరావతి: జనగసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు..అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్,,రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ఎంపిక చేశారు..వీరిద్ది ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం వీరి ఎంపికను ధృవీకరిస్తూ జనసేన అధికారిక ప్రకటన విడుదల చేసింది..రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు..అయితే ఈయన అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించగా, వ్యతిరేక ఫలితాలు రావడంతో అభ్యర్థి పేరును మార్చేశారు..మిగిలి పాలకొండ అసెంబ్లీ స్థానానికి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని జనసేన నాయకులు తెలిపారు..వీలైనంత త్వరగా పాలకొండ అభ్యర్థిని ప్రకటించేందుకు పార్టీ పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నట్లు నేతలు వెల్లడించారు..ఒక్క పాలకొండ స్థానానికి మినహా మిగిలిన అన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది.