నెల్లూరు సీటీని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకి తెలుసు-నారాయణ
నెల్లూరు: నగరాన్ని ఎవరు అభివృద్ది చేశారో,,ఎవరు చేయలేదో ప్రజలకి బాగా తెలుసునని ఆ విషయాన్ని మే 13న ప్రజలే ఓట్ల రూపంలో తీర్పునిస్తారని టీడీపీ మాజీ మంత్రి,నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు..గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా, నెల్లూరు నగరం 4వ డివిజన్లో నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు..ఈ సందర్బంలో నారాయణ మాట్లాడుతూ మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే నెల్లూరు నగరంలో పనులన్నీ పూర్తవుతాయన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి నిధులు తీసుకువచ్చి,నెల్లూరు నగరాన్ని నెం. 1 స్మార్ట్ సిటీగా గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.. అదే విధంగా 365 రోజులు మంచి నీరు అందించడం, పిల్లలు ఆడుకునేందుకు అందమైన పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు..వ్యాపారాస్తులు ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ఉమ్మడి కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.ఉమ్మడి నెల్లూరుజిల్లాలో పదికి పది శాసన సభ స్థానాలతోపాటు రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీయే కైవసం చేసుకోనుందన్నారు. మ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని సింధూర పొంగూరు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.