స్వర్ణాల చెరువు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి- కమిషనర్ వికాస్
నెల్లూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు “రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలోని స్వర్ణాల చెరువు అభివృద్ధి ప్రతిపాదనలను రూపొందించాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను సూచించారు. స్థానిక స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్ తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కమిషనర్ గురువారం పర్యటించారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి నడక మార్గం, ప్రహరీ గోడల నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న వ్యర్ధాల నుంచి కళాకృతుల ప్రదర్శన, గాజేబో, మోరల్ ఆర్ట్స్ , సస్పెన్షన్ బ్రిడ్జ్ తదితర నిర్మాణాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, ఈ.ఈ చంద్రయ్య, డి.ఈ.ఈ. ప్రసాద్,ఏ.ఈ లు, ఇరిగేషన్ ఏ.ఈ. శ్రీకాంత్ పాల్గొన్నారు.