AMARAVATHIMOVIE

తమ్ముడు పవన్ కు రూ.5 కోట్ల చెక్కు అందించిన మోగాస్టార్

అమరావతి: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ్ముడికి ఆర్ధికంగా తోడుగా ఉండాలని భావించిన మోగాస్టార్ చిరంజీవి,, పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని,, జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ.5 కోట్ల రూపాయిలను విరాళంగా చెక్కును అందించారు..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి విదితమే..వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ శివారు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.. అక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు..సోమవారం ఈ మూవీ సెట్స్ లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించారు..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీలో బిజీగా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు..రామ్ చరణ్ కూడా ఈ ఎన్నికల్లో బాబాయికి తోడుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *