హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు గురువారం హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.. బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపున లాయర్లు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. చంద్రబాబు ఎడమ కంటికి 3నెలల క్రితం క్యాటరాక్టు ఆపరేషన్ జరిగిందని,, ప్రస్తుతం కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సివుందని పిటిషన్ లో లాయర్లు పేర్కొన్నారు.. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాల పైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ తెలిపారు..శరీరంపై దద్దుర్లతో పాటు వెన్ను కిందిభాగంలో నొప్పితో బాధపడుతున్నారని హెల్త్ రిపోర్టులో సారశం.