AMARAVATHICRIME

తమిళనాడు బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, 9 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని జిల్లాలోని తిరుమనూరు ప్రాంతంలోని యాజ్ ఫైర్‌వర్క్స్ వద్ద ఘోర విషాద సంఘటన జరిగింది..బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు.. పలువురు గాయపడ్డారు..సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాక సిబ్బంది,, పోలీసు బృందాలు వెంటనే సంఘటన స్థలంకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు..ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే మరణించగా,, 2 ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు.. పేలుడు ధాటికి నాలుగు భవంతులు,, బాణసంచా ఫ్యాక్టరీ కుప్పకూలిందని తెలిపారు.. విజయ్ అనే స్థానికుడు ఈ ఫ్యాక్టరీని నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు..ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్‌లో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక సమాచారంతో తెలుస్తోందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *