నవంబరు 10న ఎస్ఇడి, శ్రీవాణి, గదుల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనంకు సంబంధించి ఎస్ఈడీ టికెట్ల కోటా విడుదల కానున్నాయి..తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్నాయి..ఇందుకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శనం టికెట్లు, గదులకోటాను టీటీడీ 10వ తేది విడుదల చేయనుంది.. ఉదయం 10 గంటలకు 2.25 లక్షల ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు..శ్రీవారి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదులకోటను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు..