AMARAVATHIMOVIE

చిత్ర పరిశ్రమలో పంకజ్ ఉధాస్ స్వరం మూగపోయింది

అమరావతి: చిత్ర పరిశ్రమలో మరో స్వరం అగిపోయింది..ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ (72) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్నాడు..తన తండ్రి సోమవారం తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ మరణవార్తను ఉధాస్ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించారు..“చాలా బరువెక్కిన హృదయంతో, 2024 ఫిబ్రవరి 26 న పద్మశ్రీ పంకజ్ ఉధాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారని మీకు తెలియజేయడానికి మేం చింతిస్తున్నాము” అని పేర్కొంది..ఉధాస్ 1980 నుంచి 1990 కాలంలో తన గాత్రంతో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గజల్ గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందాడు..పంకజ్ ఉధాస్ ప్రసిద్ధ గజల్స్ లో ‘చిట్టి ఆయీ హై’,, ‘ఔర్ ఆహిస్తా కిజియే బాతేన్’,, ‘చండీ జైసా రంగ్ హై తేరా’,, ‘నా కజ్రే కీ ధార్’ ఉన్నాయి.. కళారంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను 2006లో భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సహా సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను ఉధాస్ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *