NATIONAL

బహిరంగసభలో ఫోటోను చూసి భావోద్వేగానికి గురైన ప్రధాన మోదీ

అమరావతిం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగ నిర్వహిస్తున ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో బహిరంగసభలో ప్రసంగిస్తుండగ ఓ యువకుడు చూపించిన ఫొటోను చూసి భావోద్వేగానికి లోనయ్యారు..దీంతో మోదీ ప్రసంగం మధ్యలో కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని దమోహ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు..ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు ప్రధాని మోదీపై అభిమానంతో తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోదీ భావోద్వేగానికి లోనయ్యారు..తన మాతృమూర్తి హీరాబెన్‌ తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది.. పెన్సిల్‌తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన ప్రధాని మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపేశారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు.. ఆ ఫొటో వెనక పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు.. తాను లేఖ రాస్తానని మోదీ అన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *