AMARAVATHIPOLITICS

ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉంది,రాక్షసులతో యుద్ధం-చంద్రబాబు

బీఫారమ్‌ల పంపిణీ..

అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్,,అసెంబ్లీ అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా.చంద్రబాబు నాయుడు ఆదివారం B forms అందజేశారు..అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.. ఉండవల్లిలోని చంద్రబాబునివాసంలో బీఫారమ్‌ల పంపిణీ ప్రక్రియ సందడి వాతావరణంలో సాగింది..ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ B ఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని ఆశీర్వదించారు.. ఏపీకి ఏం చేశాడో చెప్పుకోలేకే సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.. పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు..మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలన్నారు..ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉందని,,రాక్షసులతో యుద్ధం చేస్తున్నా సంగతి గుర్తుంచుకుని దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను దీవించారు..ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదమని అన్నారు..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య సమన్వయంతో ఓటు బదిలీ జరగాలని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *