దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ప్రజలను ముందుకు నడిపించే లీడర్ ప్రధాని మోదీ-పవన్
హైదరాబాద్: ప్రపంచ ఆర్దిక వేదికపై 2047 నాటికి తొలి స్థానంలో భారతదేశంను నిలిపేందుకు బీజెపీ నిరంతరం కృషి చేస్తుందని ప్రధాన మంత్ర నరేంద్రమోదీ అన్నారు..బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ధృడమైన నిర్ణయాలు తీసుకుని,ముందుకు నడిపించే లీడర్ ప్రధాని మోదీ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు..మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజెపీ అధికారంలో వస్తే,బి.సి అభ్యర్దే ముఖ్యమంత్రిగా వుంటారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..తెలంగాణలో ముఖ్యమంత్రి అయన కుటుంబం అభివృద్ది చూసుకున్నరే తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్దిని గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు..ఆక్రమాలతో సంపాదించిన సొమ్మును,,అణాపైసలతో సహ కక్కిస్తామన్నారు..అవినితికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అనేందుకు వందల కొద్ది ఉదహరణలు వున్నయని,,అలాంటి వారిని దూరంగా వుంచితేనే,,ప్రజలకు శ్రేయస్కరమన్నారు.
పవన్ కల్యాణ్:- మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రధాని మోదీకి వున్న అనుభవం దేశానికి ఎంత ఉపయోగ పడుతుందో మీ అందరికీ తెలుసు అన్నారు..ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే, ఆర్టికల్ 370 రద్దు,, ట్రిపుల్ తలాక్ రద్దు,,మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే వారు కాదు,, రామమందిరం నిర్మించే వారు కాదన్నారు.. ప్రధాని మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం…ఎన్నికల ప్రయోజనాలు కాదు…మోదీ అంటే అందుకే నాకు అంత గౌరవం? 2004 నుంచి 2014 వరకు గోకుల్ చాట్, లుంబినీ పార్క్, ముంబై దాడులు వంటివి ఎన్నో ఉగ్రదాడులు జరిగాయన్నారు..ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బలమైన నాయకుడు కావాలి… దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి…ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి… అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు…దేశ ప్రజలు కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అంటూ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్..