దేశంలో తొలి అండర్ టన్నెల్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి: భారతదేశంలో కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు..జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ,,టన్నెల్ నిర్మాణం గురించి మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు..అనంతరం మెట్రోలో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణించారు..కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ పథకం కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు.. ఈ అండర్ టన్నెల్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ప్రయాణం సాగుతుంది..ఈ ప్రాజెక్టులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు..నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటుతుంది..ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్లు,, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు.