AMARAVATHI

“సహజీవనం” సంబంధాలను రిజిస్ట్రేషన్ చేయండి?

అమరావతి: నేటి రోజుల్లో సర్వసాధరాణమైన “సహజీవనం” సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలంటూ చేసిన అభ్యర్థను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది..ఇది ”తెలివితక్కువ ఆలోచన” అంటూ పిటిషనర్‌పై మండిపడింది..సోమవారం ప్రజా ప్రయోజనాల క్రింద దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యనించింది,,”సహజీవన సంబంధాలను రిజిస్టర్ చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుంది? ఇది ఎంత తెలివితక్కువ ఆలోచన ? ఇలాంటి వ్యాజ్యంను దాఖలు చేసి కోర్టు సమయం వృథా చేస్తే పిటిషనర్లపై జరిమానా విధించాల్సి ఉంటుంది అంటూ వ్యాఖ్యనిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు” సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ పీఎస్ నరసింహా, జేబీ పర్డివాలాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది..అత్యాచారం, హత్య వంటి నేరాలు పెరిగిపోతుండటాన్ని న్యాయవాది మమతా రాణి తన పిటిషన్‌లో ప్రస్తావించారు. సహజీవన సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆమె కోరారు..శద్ధావాకర్‌ను తన సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా ఇటీవల అత్యంత కిరాతకంగా ఢిల్లీలో హత్య చేసిన ఘటనను ఆమె ప్రస్తావించారు..సహజీవనాల రిజిస్ట్రేషన్ వల్ల సహజీవనంలో ఉండే వ్యక్తుల పూర్తి సమాచారం ప్రభుత్వం ఉంటుందని,, ఇందువల్ల అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు..దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ,,ఈ పిటిషన్‌తో సహజీవనం చేసే వారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేకుంటే ఇలాంటి బంధాల్లోకి ఎవరూ వెళ్లవద్దని చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *