భారతదేశ “దిశను” నిర్దేశించే సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ విడుదల
అమరావతి: అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ,,ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో మూడవ స్థానంలో నిలిచే దిశగా భారతదేశంను నడిపించే 2024 సార్వత్రికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది..కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించింది.. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 49.7 కోట్ల పురుష ఓటర్లు,,47.1 కోట్ల మహిళా ఓటర్లు,,18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు 21 లక్షల మంది,,వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేలు,,85 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు,,85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం జరింగిందని తెలిపారు..సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరింగిందన్నారు..
దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు:- ఏప్రిల్ 19 – తొలిదశ,,ఏప్రిల్ 26 – రెండో దశ,,మే 7 – మూడో దశ,,మే 13 – నాలుగో దశ,,మే 20 – ఐదో దశ,,మే 25 – ఆరో దశ,,జూన్ 1 – ఏడో దశ…
4వ విడతలో రాష్ట్రంలో ఎన్నికలు…ఏప్రిల్:- 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్….ఏప్రిల్:- 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ…మే:- 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్….జూన్:- 04న కౌంటింగ్…అదే రోజున పార్లమెంట్ ఎన్నికలు..( మే:-13)..