సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ MLA లాస్య నందిత రోడ్డ ప్రమాదంలో మృతి
అమరావతి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS MLA లాస్య నందిత ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు..గురువారం ఆర్దరాత్రి నల్లగొండలో BRS బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా పటాన్చెరూ సమీపంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది..దీంతో కారులు వెనుక సీట్లో కూర్చుని వున్న నందిత, తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించారు..కారు డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నమిత్తం అసుపత్రికి తరలించారు.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం..సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు BRS కంటోన్మెంట్ సీటు ఇచ్చారు.. BJP అభ్యర్థిపై ఆమె విజయం సాధించింది.