AMARAVATHINATIONAL

తమిళనాడులో RSS ర్యాలీలకు సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి: తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ర్యాలీలు నిర్వహించుకునేందుకు సుప్రీమ్ కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..రాష్ట్రంలో RSS ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ (ఎంకే స్టాలిన్) DMK  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, పంజక్ మిథాల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది..స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్బంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించాలని గత సంవత్సరం అక్టోబర్‌లో తమిళనాడు ప్రభుత్వాన్ని RSS కోరింది..నిషేధిత ‘పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా’ నుంచి దాడుల ముప్పు ఉందంటూ ఈ ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది..దీంతో మద్రాసు హైకోర్టును RSS ఆశ్రయించింది..దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత సంవత్సరం నవంబర్‌లో కొన్ని షరతులపై RSS ర్యాలీలకు అనుమతి ఇచ్చింది..ఈ తీరర్పుపై కూడా RSS డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ ఈ సంవత్సరం ఫ్రిబవరి 10న తీర్పు చెప్పింది..ఈ తీర్పుపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.. ర్యాలీలను పూర్తిగా తాము వ్యతిరేకించడం లేదని, నిఘావర్గాల హెచ్చరికలతోనే వీధివీధిన ర్యాలీలకు అనుమతించడం లేదని తెలిపింది.. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం,,మద్రాసు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ స్టాలిన్ ప్రభుత్వం పిటిషన్‌ను మంగళవారంనాడు కొట్టివేసింది..దీంతో తమిళనాడులో RSS ర్యాలీలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *